సిరా న్యూస్,హుస్నాబాద్;
హుస్నాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి..అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్..
హుస్నాబాద్ పద్మశాలి నగర్ లో 45 లక్షలతో పద్మశాలి కమ్యూనిటీ హల్ రీడింగ్ రూం కు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకు స్థాపన చేసారు..హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చెప్పే వాడిని, గీతా నేత ఒక్కటేనని పద్మశాలి భవన నిర్మాణానికి 45 లక్షలతో శంఖు స్థాపన చేసుకోవడం జరిగింది.భవిష్యత్ లో మరింత సహకారం ఉంటుంది. నిర్మాణాన్ని త్వరగా చేపట్టి పూర్తి చేయాలి. పద్మశాలి ల అభివృద్ధికి ప్రభుత్వం చిత్త శుద్ధితో కట్టుబడి ఉంది.నేతన్న బంధు కు సంబంధించి 30 కోట్లు నేతన్న బకాయిలు పూర్తయ్యాయి. జీవో నెంబర్ 1 ద్వారా నేతన్న ఉత్పత్తి చేసే ప్రతి వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి పాఠశాలకు తదితర అవసరాలకు వినియోగించుకుంటుంది.హుస్నాబాద్ లో హాండ్లమ్స్ అండ్ టెక్స్ టైల్స్ తదితర అభివృద్ధికి ప్రభుత్వపరంగా చేయాల్సిన అంశాల పై ప్రాజెక్ట్ తయారు చేయాలని అధికారులను కోరానుషెడ్ల నిర్మాణం మగ్గాలు చేనేత వర్గానికి సంబంధించి ఆర్థికంగా ఎదగడానికి మీ ప్రపోజల్ ఇస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రతి నేతకు ప్రయోజనం జరిగేలా ప్రభుత్వం తో మాట్లాడతాచదువులో వృత్తిలో వ్యవహారంలో మరింత ఎదగాలని మార్కండేయ స్వామి ఆశీస్సులతో అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలనీ మరింత ఎదగాలని కోరుకుంటున్న.త్వర త్వరగా ఈ భవనాన్ని పూర్తి చేయాలి అందరికీ శుభాకాంక్షలు