సిరాన్యూస్: ఆదిలాబాద్
విద్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టి :ఎమ్మెల్యే పాయల్ శంకర్
* రూ.75 లక్షలతో డార్మెట్రిక్ నిర్మాణానికి భూమి పూజ
చదువు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ముక్తాపూర్ లో గల బాలికల ఆశ్రమ పాఠశాల లో ఆర్టికల్ 275 ద్వారా రూపాయలు 75 లక్షలతో నిర్మించనున్న డార్మెట్రిక్ కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు స్థానికులు పుష్పగుచు మందు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గిరిజన విద్యార్థులకు మంచి చదువు అందించడంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. బడ్జెట్లో విద్య అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు మంజూరు చేసి వాటిని ఖర్చు చేస్తాము.. ప్రగతి సాధిస్తామన్నారు. విద్యా పట్ల అభివృద్ధి ఈరోజు సాధిస్తాము మిగతా అభివృద్ధి పనులు పూర్తిచే చేసుకోగలుగుతామన్నారు. నేటికీ వసతి గృహాలు పాఠశాలలు పక్కా భవనాలు లేక శిథిలావస్థలలో ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఆరు నెలల్లోని రూపాయల 75 లక్షలతో పక్కా బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ప్రధానమంత్రి జన్మాన్ యోజన పథకం కింద సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రతిపాదన పంపిన కేంద్రం వాటిని స్వీకరించి మంజూరు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే అదిలాబాద్ జిల్లా లోని అనేక సమస్యల పరిష్కారం కోసం కేంద్రానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అయినా మంజూరు చేసిన నిధులతో సకాలంలో పనులు పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో సంబంధిత అధికారులు నాయకులు, ప్రకాష్ ఆకుల ప్రవీణ్, సంతోష్, రఘుపతి, వేణుగోపాల్, లాలామున్న, సూర్యకిరణ్, శేఖర్, స్వామి రెడ్డి, తదితరులు ఉన్నారు