Human Rights Association Raj kumar: నాగభూషణం పాఠశాలలో నాణెలను ప్ర‌ద‌ర్శించిన రాజ్ కుమార్ బాశెట్టి

సిరాన్యూస్: బోథ్
నాగభూషణం పాఠశాలలో నాణెలను ప్ర‌ద‌ర్శించిన రాజ్ కుమార్ బాశెట్టి

ఆదిలాబాద్ జిల్లా బోథ్ కేంద్రంలోని నాగభూషణం పాఠశాలలో 40 దేశాల కరెన్సీ , నాణేలు ఆయా సందర్భాలలో విడుదల చేసిన మహనీయుల,జయంతి, వర్ధంతి లా నాణేలు, నిజాంల నాటి నాణాలు 1905,1910, బ్రిటిష్ వారి నాణేలు, రాగి నాణాలు, వెండి నాణెల‌ను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ భాశెట్టి ప్రదర్శించారు. నాణెల ప్రదర్శన తో పాటు ఆ నాణేలు ఏ సందర్భం లో విడుదల చేస్తారో ఇంకా వివిధ కరెన్సీ నోట్ల పై ఉన్న జాతి పితల చరిత్రను ఆ దేశాల యొక్క రాజధానుల గురించి ఆయ‌న వివరించారు. చరిత్రను నాణెల‌ ద్వారా భావితరాలకు అందించడమే తన ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిషోర్ కుమార్ ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు, స్థానిక సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్ ,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *