సిరాన్యూస్:ఖానాపూర్
మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ కు సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యాంనాయక్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్బంగా శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. రేఖానాయక్ ఆస్ట్రేలియా దేశ పర్యటనకు వెళ్లారు. అక్కడి ప్రభుత్వం రేఖా నాయక్ ప్రజాసేవలను గుర్తించి ఆస్ట్రేలియా ప్రభుత్వం సన్మానించి, సేవ అవార్డును అందజేశారు. ఈసందర్భంగా తిరిగి ఖానాపూర్ వచ్చిన సందర్బంగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అజ్మీరా రేఖా శ్యాంనాయక్ను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ టి సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్, రాసమళ్ళ అశోక్, షేక్ శమి, అనిల్ కుమార్, బి బి సింగ్, తదితరులు పాల్గొన్నారు.