సిరాన్యూస్, బజార్హత్నూర్
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత :డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గిరిజాపతి
* ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటిన వాలంటీర్లు
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గిరిజాపతి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రం లోనీ జవహర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ కళాశాల జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో వాలంటీర్లు మొక్కలు నాటారు. 2024-25 విద్య సంవత్సరంలో భాగంగా శ్రీ రాజరాజేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యంలో సుమారుగా 1000 మొక్కల నాటడం జరుగుతుందని కరస్పాండెంట్ స్వర్ణలత తెలియజేశారు. దీనిలో భాగంగా శుక్రవారం మొక్కలను నాటడం జరిగింది. అనంతరం శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గిరిజాపతి మాట్లడుతూ పర్యవారణ పరిరక్షణ లో మొక్కల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది అని , పర్యావరణన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పైన ఉంది అని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సదానందం మాట్లాడుతూ రాజ రాజేశ్వర డిగ్రీ కళాశాల జాతీయ సేవ పథకం ఆధ్వర్యములో మొక్కలు నాటడం శుభపరిణామమని, ఇలాంటి కార్యక్రమములో భాగస్వామ్యం అవుతున్న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, కళాశాల అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.