మంత్రి సీతక్క ముఖ్య అనుచరుడు రోడ్డు ప్రమాదంలో మృతి

కన్నీరు మున్నిరైన సీతక్క
సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
మంత్రి సీతక్క ముఖ్య అనుచరుడు జానంపేటకు చెందిన కట్టం సాయి (22 ) బుల్లెట్ ) వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న గేదె బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలైనాయి . స్థానికులు ఆటో ద్వారా మణుగూరు లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కట్టం సాయి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి ధనసరి సీతక్క హుటా హుటిన మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని కి నివాళులర్పించి, మా కుటుంబ సభ్యున్ని కోల్పోయానని కంటతడి పెట్టుకున్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, మా కుటుంబ సభ్యున్ని కూలిపోయానని, నిత్యం నాతోపాటు నా కుమారునితో కలిసిమెలిసి ఉండేవాడని ఆమె అన్నారు. చిన్నతనంలోని తన తండ్రిని కోల్పోయాడని తమ కుటుంబానికి పెద్ద దిక్కు అయినా సాయి మృతి చెందడం ఎంతో బాధగా ఉందంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. మంత్రి సితక్కను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మనీరు అవుతుండగా ఎల్లవేళలా కట్టం సాయి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *