సిరాన్యూస్, ఆదిలాబాద్
పేదల గుండె చప్పుడు వైఎస్ఆర్ : కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేష్
* కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ 15వ వర్ధంతి
పేదల గుండె చప్పుడు వైఎస్ఆర్ అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేష్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతిని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. వైఎస్ఆర్ అమర్ రహే అంటూ పెద్దపెట్టున నినదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కమిటి పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో రిమ్స్ ఆసుపత్రి సేవలు ఆయన పుణ్యమే అన్నారు వృద్ధులకు పెన్షన్ అందించే బృహత్తర పథకం చేపట్టిన వృద్ధుల గుండె చప్పుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆయన హయాంలోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హరితాంధ్ర ప్రదేశ్ గా మారిందన్నారు. కార్యక్రమం లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్,భూమన్న,లక్ష్మణ్,జాఫర్ అహ్మద్,ఇమ్రాన్, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి,ఎం.ఏ షకీల్,ఎం.ఏ కయ్యుమ్, మహిళా నాయకురాలు శ్రీలేఖ ఆదివాసీ,షబానా,అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.