బస్సుల్లో పోటెత్తిన మహిళా అందోళన కారులు

సిరా న్యూస్,జగిత్యాల;
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండు చేస్తూ తెలంగాణ లోని వివిధ జిల్లాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు సీపీఎం ఆధ్వర్యంలో పిలుపు నివ్వగా ఆధార్ కార్డులు, దరఖాస్తులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు కలెక్టరేట్ నుంచి భారీ ర్యాలీగా యావర్ రోడ్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర జిల్లా నాయకులు హాజరై వారితో ర్యాలీలో పాల్గొన్నారు కాగా తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్ సందర్భంగా వేలాదిగా మహిళలు వచ్చి ఇప్పటికే రెండు నెలలుగా జగిత్యాల టిఆర్ నగర్ లో గల ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని వేలాదిగా గుడిసెలు వేసికొని కబ్జా చేశారు ఆ భూమిని తమకు రిజిస్ట్రేషన్ చేసి గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు ..మరోవైపు బస్ లలో సీట్ల కెపాసిటీ మించి వందకు పైగా మహిళలు బస్ లలో ప్రయాణం చేస్తుండగా ఏదైనా ప్రమాదం జరుగుతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటరాని ఆందోళన చెందుతున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *