సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
పలువురి అంతిమ యాత్రలలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని పలు గ్రామాలలో పలువురు సోమవారం మృతి చెందారు. మిరజంపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గూడెపు జనార్దన్ రెడ్డి తండ్రి, కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన చెప్ప్యాల పవన్, తూండ్ల శ్రీనివాస్ల అంతిమ యాత్రలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ పాల్గొన్నారు. అనంతరం వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అయన వెంట మాజీ సర్పంచ్ మదాసి సతీష్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం డి మున్నీర్, మండల అధ్యక్షులు గజవేనా సదయ్య, అల్లంల దేవేందర్, రానవేనా శ్రీనివాస్, క్రాంతి, బంగారి రమేష్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.