బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కి సమ్మె నోటీసు ఇచ్చిన కార్మికులు
సిరా న్యూస్,బద్వేలు;
సమస్యలను పరిష్కారం కై ఈనెల 27వ తేదీన సమ్మెలోకి పోతున్నామని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కె.వి.కృష్ణారెడ్డికి మంగళవారం కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు ఈ సందర్భంగా ఏఐటియుసిమున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్, మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని, అంతవరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకుసంబంధించి జీవో నెంబర్ 30 సవరించి స్కిల్డ్,అన్ స్కిల్డ్,సెమీ స్కీల్డ్ వేతనాలు పెంచాలని, డ్రైవర్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే పార్క్ వర్కర్లు,స్కూల్ స్విపర్లకుతదితరులకు హెల్త్ అలవెన్స్ అందివ్వాలని, కనీస వేతనాలు 26వేల రూపాయలు చెల్లించాలని, కరోనా విపత్తులో పనిచేసే మరణించిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు చెల్లించాలని,పర్మినెంట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవుల వేతనం విడుదల చేయాలని, జిపిఎఫ్ ఖాతాలు తెరవాలని, టైం స్కేల్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకు సుప్రీంకోర్టుతీర్పు ప్రకారం 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, క్లాప్ డ్రైవర్లకు కనీస వేతనం 18,500 సాంఘిక భద్రత కల్పించాలని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి సంక్షేమపథకాలు యధావిధిగా కొనసాగించాలని 62 సంవత్సరాలు నుండి రిటైర్మెంట్ అయిన ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు చెల్లించాలని తదితర డిమాండ్లపై సమ్మె నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈకార్యక్రమంలో ఏ ఐ టి యు సి బద్వేల్ పట్టణ అధ్యక్షులు జిఎల్ నరసింహ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మల్లికార్జున మున్సిపల్ యూనియన్ నాయకులు జెవి రమణ రావు సునీల్ నాగరాజుప్రసాద్ బాబి తదితరులు పాల్గొన్నారు.