సిరాన్యూస్, జైనథ్
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: జడ్పీ సీఈఓ జితేందర్రెడ్డి
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ సీఈఓ జితేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కాప్రి గ్రామంలో శానిటరీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈసందర్బంగా గ్రామం లోని వివిధ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రవీంద్ర నాథ్,ఎంపీఈఓ వెంకట్ రాజు, పంచాయతీ కార్యదర్శి గంగన్న, మాజీ సర్పంచ్ రామీల -వెంకట్ రెడ్డి ఉన్నారు.