విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

సిరా న్యూస్,రుద్రవరం;
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సంగెపు నాగేశ్వరరావు రుద్రవరంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బరాయుడు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అన్నారు. రుద్రవరం ఆదర్శ పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కస్తూరిబా పాఠశాలతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తినే పవిత్ర కార్యంగా భావించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. సమాజ సేవకులుగా నవభారత ప్రగతిశీల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రూపశిల్పులుగా విద్యార్థులను రూపొందిస్తున్నది ఉపాధ్యాయులేనని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ బృందానికి పాటలు పోటీలు నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు అందరు కలిసి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. రుద్రవరం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భవిష్యత్తులో విద్య ఎంత ఉపయోగం విద్యలో పట్టు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఎంతటి ఘనవిజయాలు సాధిస్తారో విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృత కార్యక్రమాలు క్రీడా పోటీలు విద్యాపరమైన గీతాలాపనలతో విద్యార్థులను అలరించారు. ఈ కార్యక్రమాలలో ఆదర్శ పాఠశాల వయసు ప్రిన్సిపల్ సురేష్ కుమార్ కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీదేవి తోపాటు ఆయా పాఠశాలల కమిటీ చైర్మన్ లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *