సిరాన్యూస్, ఓదెల
ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే మెరుగైన ఫలితాలు : ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
* మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి
* విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన
* ఉత్తమ సేవలు అందించిన 42 మంది ఉపాధ్యాయులకు సన్మానం
ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే మెరుగైన ఫలితాలు వచ్చాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణ , అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.శ్యాంప్రసాద్ లాల్ పాల్లొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మాట్లాడుతూతాను ఇంతగా ఎదగడానికి గురువులు నేర్పిన విద్యాబుద్ధులే కారణమని వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని అన్నారు.ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని, మారుమూల ప్రాంతాల్లో విద్యార్థు తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను గుర్తించి వారిని సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఉపాధ్యాయ అవార్డు వచ్చిన ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన 42 మంది ఉపాధ్యాయులను ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులగా విచ్చేసిన వారితో కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికారులు ,ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.