సిరా న్యూస్,హైదరాబాద్;
నపద కళలకు, సంప్రదాయాలకు తెలంగాణ పెట్టని కోట అనీ, తెలంగాణ సమాజంలోనే కళాకారులను గౌరవించే తత్వం ఉందనీ, తెలంగాణ ప్రజలు అనాది జీవన కళలను నిరంతరం కాపాడుకుంటూ వస్తున్నారని ఎక్సైజ్ ప్రోహిబిషన్, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలోని ఆశ్రిత కులాలలో అత్యున్నత కళా ప్రతిభ, సాంస్కృతిక విశిష్టత దాగి ఉందని, అలాంటి కళాకారులలో వైష్ణవతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మిత అయ్యల్ వార్లు ఒకరని ఆయన అన్నారు. డా. ఆవాల వీణ రచనలో భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘మిత అయ్యల్ వార్లు’ పుస్తకాన్ని ఈ రోజు సెక్రెటేరియట్ లో ఆవిష్కరించిన ఆయన, భవిష్యత్ లో అన్ని రకాల ఆశ్రిత కులాల కళారూపాలు, జానపద కళలకు సంబంధించిన విశేషాలను సేకరించి ప్రచురిస్తామని అన్నారు. తెలంగాణలో ఉన్న సమస్త జానపద, గిరిజన, గ్రామీణ వృత్తికళా రూపాలను, హైదారాబాద్ దక్కనీ, శాస్త్రీయ సంప్రదాయ కళారూపాలను, సాహిత్యాన్ని, చరిత్ర రచనను ప్రోత్సహించే దిశగా మరిన్ని చర్యలు చేపడతామని, సకల కళలకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా డాక్యుమెంటేషన్ చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ ఇతరులు పాల్గొన్నారు