క్రీడల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
సిరా న్యూస్,కర్నూలు;,
ఈ నెల 26 వ తేదీన ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణ ప్రారంభం కానున్నందున, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆడుదాం ఆంధ్ర నిర్వహణ పై మండల స్పెషల్ ఆఫీసర్ లతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లేయర్ రిజిస్ట్రేషన్ దాదాపు పూర్తి అయిందని, ఇక టీమ్స్ ఏర్పాటు, గ్రౌండ్స్ గుర్తింపు పై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు..ప్రతి సచివాలయం పరిధిలో 5 క్రీడలను కచ్చితంగా నిర్వహించాలన్నారు.. అందుకనుగుణంగా గ్రౌండ్స్ ను గుర్తించి ఆడడానికి వీలుగా ఉండేలా వాటిని సిద్ధం చేయాలన్నారు..అలాగే ఆయా క్రీడలకు సంబంధించిన క్రీడాకారులతో టీములు ఏర్పాటు చేయాలన్నారు. ఏ సచివాలయం, ఏ గ్రౌండ్ లో, ఏ టీమ్ ఆడతారు అన్న వివరాలతో షెడ్యూల్ ను రూపొందించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ..రెండు,మూడు రోజుల్లో ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావాలన్నారు. క్రీడాకారులకు అవసరమైన కిట్స్ పూర్తి స్థాయిలో చేరాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు. తాగునీటి తో పాటు క్రీడాకారులకు తప్పనిసరిగా భోజన సదుపాయం కల్పించాలన్నారు..ఇందుకోసం నేడో, రేపో నిధులు విడుదల కానున్నాయని కలెక్టర్ తెలిపారు. ఆయా క్రీడలకు రెఫరీలుగా వ్యవహరిస్తున్న వారు క్రీడలకు సంబంధించిన నియమ నిబంధనలపై పూర్తిగా స్పష్టత కలిగి ఉండాలన్నారు.. . నియమ నిబంధనల కాపీలను రెఫరీ లకు అంద చేయాలన్నారు.. క్రీడల నిర్వహణల సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు..మండల స్పెషల్ ఆఫీసర్లు గురువారం వారికి కేటాయించిన మండలాలకు వెళ్లి, ఏర్పాట్లన్నీ సజావుగా జరుగుతున్నాయా లేదా పరిశీలించాలన్నారు.. సంబంధిత మండల,గ్రామ స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి, ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. సచివాలయానికి ఒక మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించుకోవాలని కలెక్టర్ మండల స్పెషల్ ఆఫీసర్ లకు సూచించారు..