సిరాన్యూస్, ఓదెల
బాయమ్మపల్లిలో కుంకుమ పూజ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని భాయమ్మ పల్లె హనుమాన్ ఆలయం వద్ద గల గణేష్ మండపం వద్ద ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మహా అన్న ప్రసాద కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్రము లోని ప్రజలు అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు అధిక పంటలు పండాలని కోరుకున్న మన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, యాదవ సంఘం మండలాధ్యక్షుడు కావేటి రాజు యాదవ్, మాజీ సర్పంచ్ లు పడాల రాజు, తెలుసురి కొమురయ్య , అలెటి సంపత్ రెడ్డి,కమిటీ సభ్యులు , మల్లేష్, పడాల నరేష్, డోబిల మల్లయ్య, వీరేశం, మద్దూరి లింగయ్య,గిరాం సదానందం, మారం నర్సింహా రెడ్డి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు