డాక్టర్ల నిరసన

సిరా న్యూస్,పెద్దపల్లి;;
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిన్న పిల్లల వైద్య నిపుణుడు రాజేష్ పై జరిగిన దాడిని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు పగడాల కాలి ప్రసాదరావు ఆధ్వర్యంలో పెద్దపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించి రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యుడు రాజేష్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించడం తప్ప ప్రాణాలు తీసే ఆలోచన తమకు ఉండదని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో రోగుల ఆరోగ్య పరిస్థితి విషమించి మరణిస్తే అందుకు కారణం వైద్యులు కాదని తెలిపారు. రోగులు ప్రాణాలు కోల్పోతే బాధితులు వైద్యులపై చట్ట ప్రకారంగా వెళ్లాలి తప్ప దాడులు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో వైద్యులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. అనంతరం వైద్యుడు రాజేష్ పై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *