సిరా న్యూస్,అమరావతి;
గత 5 ఏళ్లలో జగన్ సర్కారు నిర్వీర్యం చేసిన ఉన్నత విద్య రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. . కుప్పం ద్రవిడ యూనివర్శిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షసానందం పొందారు. ఈ విషయాన్ని అక్కడి ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు రూ.2.86 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు.