సిరా న్యూస్, ఓదెల
త్వరలోనే విద్యుత్ శక్తి పవర్ ప్లాంట్ పనులు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
* పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
త్వరలోనే విద్యుత్ శక్తి పవర్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం
పెద్దపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. అనంతరం ఐదు సబ్ స్టేషన్ లకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజల చిరకాల వాంఛ రిజర్వాయర్ విద్యుత్ శక్తి పవర్ ప్లాంట్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు కోరిక మేరకు ఓదెల మండలం రూపు, నారాయణపేట, మానేరుపై త్వరలోనే బ్రిడ్జి మంజూరు చేస్తానని ఆయన అన్నారు. కాచాపూర్ గ్రామంలో త్వరలోనే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని అన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం శ్రీకృష్ణ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మంథిని ఎమ్మెల్యే మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.