సిరాన్యూస్, సామర్లకోట
ఉండూరులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా శుక్రవారం సామర్లకోట మండలం ఉండూరు గ్రామ పంచాయితీలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈసందర్బంగా ఉండూరు గ్రామంలో టీడీపీ నాయకులు, అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పత్రాలను అందజేశారు.
ఈకార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, జిల్లా భూగర్భ జలాధికారి రాధాకృష్ణ , మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి డి.శ్రీలలిత , విస్తరణాధికారి, పి.ఆర్ఆర్.డి, కర్రి హరికృష్ణసత్యరెడ్డి , పంచాయితీ కార్యదర్శి టి.సత్యనారాయణ , సర్పంచ్ సత్యాది ధనలక్ష్మి సత్యనారాయణ ,ఎం.పి.టి.సి సభ్యులు ముసలి బుజ్జమ్మ , తెలుగుదేశం నాయకులు కొప్పిరెడ్డి రాజా ,బచ్చల రామారావు ,కొప్పిరెడ్డి సూర్యప్రకాశరావు ,కొప్పిరెడ్డి శాంబమూర్తి ,జనసేన నాయకులు సలాది తాతాజీ , కొప్పుల శ్రీనివాస్ , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.