బొగ్గు బాయిల మీద కార్మికుల సంబరాలు

సిరా న్యూస్,కమాన్ పూర్;
సింగరేణి సంస్థ ఆర్జీ 3 ఏరియా ఓపెన్ కాస్ట్ 2 లో ఐఎన్టీసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు శనివారం సంబరాలు నిర్వహించుకున్నారు.
పిట్ సెక్రెటరీ రామిండ్ల మనోహర్ మాట్లాడుతూ కార్మికులకు లాభాల వాటా 33% చెల్లించేందుకు యాజమాన్యాన్ని ఒప్పించిన ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్, శ్రీ జనక్ ప్రసాద్ , కార్మికుల సమిష్టి కృషి మరియు ప్రభుత్వ సహకారంతో సింగరేణి2023-24 సంవత్సరానికి70.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించినందుకు,
37.500 కోట్ల టర్నోవర్ తో 20038 కోట్ల నికర లాభాలు సాధించింది మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రజా పాలనలో 33% అంటే 796 కోట్లు కార్మికులకు చెల్లించనుంది సగటున్న ఒక్క కార్మికునికి 1,90,000 చొప్పున రానున్నాయి అంతేకాకుండా,మునుపెన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఒకరికి 5000 చొప్పున రానున్నాయి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు దీనికి సహకరించిన ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి,కి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,కి ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబు కి, సెక్రటరీ జనరల్ ఐఎన్టియుసి, జనక్ ప్రసాద్ కి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నరసింహారెడ్డి గారికి, సెంట్రల్ నాయకులు ధర్మపురి కి, మరియు ముఖ్య నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు అనంతరం స్వీట్లు పంచినారు, ఈ కార్యక్రమంలో, పిట్ కమిటీ సభ్యులు, ఐ ఎన్ టి యు సి కార్యకర్తలు,మంగయ్య, గిరవేణి కొమురయ్య, ఉయ్యాల కుమారస్వామి,సమ్మిరెడ్డి, మందల రమేష్, బండ సమ్మయ్య, యాకూబ్, అబ్దుల్ కాసిం, సత్తన్న, బుద్దె సదానందం, కిష్టయ్య, శ్రీనివాస్, రంజాబీ, మరియు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *