సిరా న్యూస్,శ్రీకాకుళం;
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం చోడవరం వడ్డాది మధ్య తాచేరు నదిపై విజయరామరాజుపేట వద్ద గతంలో నిర్మించిన వంతెన కూలిపోయింది. చోడవరం నుండి అల్లూరి సీతారామరాజు జిల్లాపాడేరు కు వెళ్లే రహదారి మార్గంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవటంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అక్రమ ఇసుక తవ్వకాలు జరగటం తో నదీ పరివాహక ప్రాంతం బలహీనపడటం, రాత్రివేళల్లో భారీ వాహనాలు టన్నుల బరువున్న అక్రమ ఇసుక, గ్రావెల్ తో లారీలు తిరగటం తో వంతెన బలహీనపడి కూలిపోయింది.
బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు అనేకసార్లు స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వంతెన కుప్పకూలినఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వంతెన కూలిన సమయంలో బ్రిడ్జిపై ఇతర వాహనాలేవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.