సిరా న్యూస్, రాజన్న సిరిసిల్ల:
వస్తువుల నాణ్యత ప్రమాణాలను సూచించేది ఐ ఎస్ ఐ మార్క్..
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మెంబెర్స్ …
కేజీబివి సిరిసిల్ల పాఠశాలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, బియాేస్ అడిషనల్ డైరెక్టర్ సి ఎహ్ విదిష , రిసోర్స్ పర్సన్ జి .ప్రభాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. బీఐఎస్ 77 ఫౌండేషన్ డే సందర్భంగా విద్యార్థులకు ఐఎస్ఐ మార్క్ గురించి వివరంగా తెలియజేశారు. బంగారు నగలకు సంబంధించి హాల్ మార్క్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అగ్రి మార్క్ ల గురించి వివరించారు. వివిధ వస్తువుల ప్రామాణికతను తనిఖీ చేసుకోవడానికి ఐఎస్ఐ మార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అన్నారు. అనంతరం స్టాండర్డ్ రైటింగ్ కాంపిటీషన్, పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులను ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, స్పెషల్ ఆఫీసర్ కె. పావని, పాఠశాల స్టాండర్డ్స్ క్లబ్ ఇన్చార్జి దివ్య , విద్యార్థులు పాల్గొన్నారు.