సిరాన్యూస్, బేల:
ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు గాడ్గే మహారాజ్….
అడానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్.…
ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించే విధంగా పాటుపడిన మహాత్ముడు, ఆదర్శప్రాయుడు గాడ్గే మహారాజ్ అని ఆడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్ అన్నారు. గాగ్డే మహారాజ్ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని స్థానిక గాడ్గే మహారాజ్ చౌరస్తాలో మండల బిఆర్ఎస్, రజక సంఘం నాయకులతో కలిసి మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆయన చేసిన సేవలు గురించి కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇంద్ర శేఖర్, రజక సంఘం మండల అధ్యక్షులు ప్రకాష్, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి,మాజీ సర్పంచ్ తేజ రావు, మాజీ వైస్ ఎంపీపీ సంజయ్ నిపుంగే, రజక సంఘం మండల నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు.