వృద్దురాలిపై దాడి… బంగారం దోపిడి

సిరా న్యూస్,మేడ్చల్;
శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముడుచింతలపల్లి మండలం, జగ్గంగూడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న భార్యభర్తలు బర్త్ డే పార్టీ అని ఇంటి యజమాని అయినా వృద్దురాలు శివ్వ రాములమ్మ ను పిలిచి, కళ్ళు చేతులు కట్టేసి,నోట్లో గుడ్డలు కుక్కి ఆమె వంటి పై ఉన్న 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.కాసేపటికి వృద్దురాలు నోట్లోని గుడ్డలు తీసుకోని కిటికీలోనుండి అరవడంతో చుట్టుపక్కల వారు ఆ వృద్దురాలి ఇంటికి చేరుకొని చూడగా స్వల్ప గాయలు అయ్యాయి. స్థానికులు ఆమెను ములుగులోని ఆర్ వి ఏం హిస్పిటల్ కు తరలించారు.ఘాటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దారియాప్తు చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ దంపతులు వారం క్రితమే అద్దెకు దిగారని వారికీ ఇంట్లోకి సామాన్లు లేకపోతే వృద్దురాలే ఇచ్చిందని తెలిపారు. దొంగతనానికి పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *