సిరా న్యూస్,సికింద్రాబాద్;
టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారిని కట్టడి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ముఖ్యంగా పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని టికెట్ లేని ప్రయాణికులకు కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అక్టోబరు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, అక్టోబరు 25వతేదీ నుంచి నవంబరు 10వ తేదీ వరకు టికెట్ లేని, అనధికారిక ప్రయాణికులను కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని 17 జోన్ల జనరల్ మేనేజర్లకు రైల్వేశాఖ లేఖ రాసింది.