NSUI Madugula Chintu: నిధుల కేటాయింపు హ‌ర్షం : ఎన్ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల చింటూ

సిరాన్యూస్‌,భీమదేవరపల్లి
నిధుల కేటాయింపు హ‌ర్షం : ఎన్ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల చింటూ

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ బీసీ కాలనీకి రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయించడం సంతోషంగా ఉందని ఎన్ ఎస్ యు ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల చింటూ అన్నారు. మండలంలో రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముల్కనూర్ స్టేట్ బ్యాంక్ నుండి కొత్తపల్లి ఎక్స్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1 కోటి 35 లక్షలు నిధులు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం మండలంలో నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టలేదని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా బీసీ కాలనీకి రోడ్డు లేక అవస్థలు ఎదుర్కొన్నామని, గత ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ కాలనీవాసుల కష్టాలను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని నిధులు కేటాయించారని, అందుకు కాలనీవాసుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *