సిరాన్యూస్, కళ్యాణదుర్గం
సమాజ సేవలో భాగస్వామ్యం కావాలి: ప్రిన్సిపాల్ మల్లికార్జున
* ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం
విద్యార్థులు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జాతీయ సేవ పథకం దినోత్సవాన్నిఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మల్లికార్జున మాట్లాడారు. విద్యార్ధి దశ నుండి సేవ భావం అలవరుచుకొని సమాజ సేవలో భాగస్వామ్యం కావాలి అన్నారు. సీనియర్ అధ్యాపకులు జగన్నాథ్ మాటాడుతూ విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్, ఓటు హక్కు వినియోగం పై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు మల్లప్ప, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటేష్ బాబు, ఎన్ఎస్ఎస్ వాలెంటీర్స్ పాల్గొన్నారు.