సిరా న్యూస్,జగిత్యాల;
రాష్ట్ర బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,రాష్ట్ర ఐటి,పరిశ్రమలు అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అస్సోసియేషన్ రాష్ట్రఅధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర,జిల్లాల ప్రతినిధులు హైదరాబాద్ లో కలిసి శుభాభినందనలు తెలిపినట్లు ఆ పెన్షనర్స్ అస్సోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సానుకూలంగా స్పందించారని వివరించారు.అస్సోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతరావు,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కార్యదర్శి బొల్లం విజయ్ ,కోశాధికారి గౌరిశెట్టీ విశ్వనాథం,ఉపాధ్యక్షుడుఎం.డి.యాకూబ్,హైదరాబాద్ అధ్యక్షుడు హెచ్.రాములు,కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కేశవ రెడ్డి,కార్యదర్శి ఎలదాసరి లింగయ్య, రాష్ట్ర,జిల్లాల ప్రతినిధులు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు.