సిరాన్యూస్, ఖానాపూర్
ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పీఠం ఎవరిదో..!
* ఆశల పల్లకీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఖానాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వెడ్మ బొజ్జు పటేల్ గెలుపొందారు.
ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఎస్సి సామాజిక వర్గానికి రిజర్వేషన్ ప్రకటించింది.
ఈసారి ఈ పదవికి అనేకమంది పోటీ పడుతున్నారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన జూనియర్ నాయకులు ఉన్నారు. వీరంతా ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులకు దరఖాస్తు పెట్టుకున్నారు. దీంట్లో పదవి ఎవరికి వరించును అని ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే ఎవరికీ పదవి ఇచ్చినో అని అర్థం కాకుండా ఉన్నారు. చైర్మన్ పదవి పార్టీలో సీనియర్ నాయకులకు వరించునో లేదా జూనియర్ నాయకులకు వివరించునో అని పార్టీలో చర్చలు నడుస్తున్నాయి. ప్రచారం పార్టీలో పని చేసిన ఎస్సి నాయకులు నిత్యం ఎమ్మెల్యే ని కలుస్తూనే ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ పరిధిలోని నాలుగు మండలాల్లోని నాయకులు పోటీ పడుతున్నారు. మా మండలానికి పదవి రావాలనే ధోరణిలో ఉన్నారు. కడెం మండలానికి చెందిన నాయకులు కడెం మండలానికే ఎమ్మెల్యే చైర్మన్ పదవి ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. లేదు ఆ ప్రచారం నిజం కాదని ఖానాపూర్ నాయకులు కొట్టి పారేస్తున్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో పలువురు…
చైర్మన్ పదవికి ఎమ్మెల్యే కి దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియర్ నాయకులు రాసమల్ల అశోక్ న్యాయవాది, దుర్గా భవాని,పడిగేల భూషణ్,మ్యాదరి రాజేశ్వర్, దుర్గం మల్లేష్, మైస శ్రీనివాస్, తదితరులు ఎమ్మెల్యే కి దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు . రాసమల్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నే నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీ మారకుండా పార్టీ నే నమ్ముకుని ఉన్న ఏకైక దళిత నాయకుడని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఉన్న వ్యక్తి అని తెలుస్తుంది.గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి పార్టీకి సేవ చేస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఖానాపూర్ మండల యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందో వేచి చూడవలసి ఉన్నది.