సచివాలయ ఉద్యోగుల సంఘంకి ప్రభుత్వం షోకాజ్ నోటీస్
సిరా న్యూస్,అమరావతి;
వెంకట్రామిరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సాధారణ పరిపాలన శాఖ షోకాజ్ నోటీసులు అందజేసింది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో తెలియచేయాలంటూ జీఏడీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. వెంకటరామిరెడ్డి అందుబాటులో లేకపోవటంతో అప్సా తరపున ప్రభుత్వానికి కార్యదర్శి కృష్ణ, ఇతర ఆఫీసుబేరర్లు సమాధానం ఇచ్చారు. వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత హోదాలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ప్రభుత్వానికి అప్సా కార్యదర్శి, ఆఫీసు బేరర్లు వివరణ ఇచ్చారు. సచివాలయానికి వెలుపల చేసిన కార్యకలాపాల గురించి తమను ఎప్పుడూ సంప్రదించలేదని సాధారణ పరిపాలన శాఖకు వివరించారు.