సిరా న్యూస్, కుందుర్పి
బాలుడు వైద్యం కోసం రూ.30వేలు అందజేత : ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలంలో ఓ బాలుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ బాసటగా నిలిచారు. వివరాల్లోకెళ్తే…కుందుర్పి మండలం యర్రగుంట గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన చెలిమప్ప,అశ్విని దంపతులకు ఏడాదిక్రితం మగబిడ్డ జన్మించారు.బాలుడు అనారోగ్యంతో ఏడుస్తుంటే తల్లితండ్రులు వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడి డాక్టర్లు బాలుడి కిడ్నీలు ఇన్ఫెక్షన్ కు గురయ్యాయి. వెంటనే ఆపరేషన్ చేయిస్తేనే బిడ్డ బ్రతుకుతారని సూచించారు.చెలిమప్ప దంపతులు అనంతపురంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళగా ఆపరేషన్ కు రూ.30,000/- అవుతుందని తెలపడంతో, ఆపరేషన్ కోసంఅయ్యే డబ్బులు ఇప్పటికిప్పుడు ఎలా తేవాలని మదన పడుతూ…చెలిమప్ప తన స్వగ్రామంలోని ఇల్లు 50వేలకు అమ్మకానికి పెట్టి బాలుడిని ఆసుపత్రి లో అడ్మిట్ చేశారు.కాని ఇల్లు అమ్మడుపోలేదు. ఆసుపత్రి వారు డబ్బులు కడితేనే ఆపరేషన్ మొదలు పెడతామని చెప్పగా చెలిమప్ప తన మిత్రుల సలహాతో చివరి ప్రయత్నంగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్, వారికి తన దీన స్థితిని తెలపఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ బద్దేనాయక్ తక్షణమే ట్రస్ట్ సభ్యులు మహలింగ మిత్రుడు శివ లను నేరుగా ఆసుపత్రికి పంపించి హాస్పిటల్ ఖర్చు రూ.30,000/- కట్టి ఏడాది వయసున్న బాలుడికి ఆపరేషన్ చేయించారు.ప్రస్తుతం బాలుడి ఆపరేషన్ విజయవంతం అయింది. మా బిడ్డకు ఆపరేషన్ చేయించి బ్రతికించారని తల్లితండ్రులు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కు కృతజ్ఞతలుతెలిపారు .కార్యక్రమంలో ఇన్ఫినిటీ చారిటబుల్ సభ్యుడు మహలింగ, మిత్రులు శివ, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.