సిరా న్యూస్, అదిలాబాద్:
ఘనంగా ఉత్తర ద్వార దర్శనం…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని అతి పురాతన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో శనివారం ఉదయం వేకువజామున ఘనంగా ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ప్రతిష్టించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భక్తుల దర్శనార్థం శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భజనలు, కీర్తనలు చేశారు.