ధర్మపురిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి… శ్రీ ఉగ్ర నరసింహ స్వామి…శ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాట్ లకు పంచామృతాలతో అర్చకులు మహాక్షిరాభిషేకం నిర్వహించారు. భక్తులు భారీగా సంఖ్యలో హాజరైయారు. ప్రాతః కాలం 4గంటలకు ఉత్తర ద్వారం ముందు ప్రత్యేక పుష్ప వేదికవై శ్రీ లక్ష్మీనరసింహస్వామి…శ్రీ వెంకటేశ్వర స్వామి…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, సప్త హారతులు నిర్వహించారు. శ్రీ మఠం పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వాములచే వైకుంఠ ద్వార దర్శన ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ప్రారంభం అయింది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *