అన్నవరంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు

సిరా న్యూస్,అన్నవరం;
ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం నుండి సత్యదేవుని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున అన్నవరం చేరు చేరుకున్నారు. దేవస్థానం అధికారులు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి తొలి దర్శనం కల్పించారు. ఆలయ మర్యాదలతో స్వాత్మానందేంద్రకు స్వాగతం పలికారు. అనంతరం భక్తులకు ఉ 5.00గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు భక్తులు శ్రీ స్వామివారి ఉత్తర ద్వారం దర్శించుకొనుటకు అవకాశం వైకుంఠ ద్వారం నుంచి సత్యదేవుని దర్శించుకునే అవకాశం కల్పించారు.జై సత్యదేవ..
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, శ్రీ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన సందర్భంగా ఆలయ సాంప్రదాయ ప్రకారం చైర్మన్, కార్యనిర్వహణ అధికారి, ర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికి శ్రీ స్వామి వారి దర్శనము మరియు ఆశీర్వచనము నిర్వహించారు,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *