టీడీపీ ఎన్ఆర్ఐ నేత అరెస్టు

సిరా న్యూస్,రంగారెడ్డి;
టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ బొద్దులూ రిని ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. అనా రోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందు కు వచ్చిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మంగ ళగిరిలోని కార్యాలయానికి తరలించా రు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నట్టు తెలుస్తోంది. యశ్ అరెస్ట్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. యశ్ బొద్దులూరిపై ఏపీలో అక్రమ కేసులు నమోదు చేశారని… నిన్న రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయ నను అరెస్ట్ చేశారనే విషయం తెలిసి షాక్ కు గురయ్యానని టీడీపీ యువ నేత నారా లోకేశ్ అన్నారు. క్రూరమైన ఈ ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అణచివేయాలను కుంటోందని మండిపడ్డారు. ఒక టెర్రరి స్టు మాదిరి ఆయనను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. యశ్ కి న్యా యం జరిగేంత వరకు విశ్రమించబోమ ని చెప్పారు. వైసీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *