సిరాన్యూస్,బేలా:
డిగ్రీ విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
-హరీష్ రెడ్డి..
ఇటీవల డిగ్రీ పరీక్ష రాసి ఇంటికి వెళ్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బజార్హత్నూర్ మండలం ఉప్పర్ పల్లికి చెందిన తొడసం రాహుల్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బేల మండల కేంద్రంలో యధావిధిగా డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు..ఈ సమావేశంలో ఏబీవీపీ నాయకులు మనోజ్ రెడ్డి,నవనిత్,ప్రీతం,సాయి, సుమిత్, సూరజ్,తదితరులు పాల్గొన్నారు