సిరా న్యూస్, లోకేశ్వరం:
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
లోకేశ్వరం మండలంలోని గుడిసెరా, బామ్ని (కె) గ్రామాల్లో ఆదివారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బ్యాంక్ మేనేజర్ అశోక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. బ్యాంకులో ఖాతా కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనాలు పొందాలని కోరారు.