సిరా న్యూస్,బేల:
పార్టీని వీడే ముందు పదవికి రాజీనామా చేయాలి
– బేల మండల నాయకుల హెచ్చరిక
బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించిన డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బిఆర్ఎస్ యువ నాయకులు సతీష్ పవార్ డిమాండ్ చేశారు. ఆదివారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి జోగు రామన్న కారణంగా ఎన్నో పదవులు అనుభవించి ప్రస్తుతం పార్టీకి రాజీనామా చేయడం తగదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త జోగు రామన్న వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. పదవులు పొందిన వారు పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో రాజీనామాలు చేయడం సరికాదన్నారు. పదవికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీని వీడాలని అన్నారు. అడ్డి భోజా రెడ్డి వెనక ఏ ఒక్క కార్యకర్త లేరని, జోగు రామన్న సైనికుల్లాగా తామంత పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపిపి గంభీర్ ఠాక్రే, పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, జక్కుల మధుకర్, బాలచందర్, జితేందర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.