Shobha Yatra – శోభయమానంగా శోభయాత్ర

సిరా న్యూస్, లోకేశ్వరం:

శోభయమానంగా శోభయాత్ర
– అయోధ్య నుంచి లోకేశ్వరం మండల కేంద్రానికి చేరుకున్న అక్షంతలు
– కాషాయ జెండాలు చేతబూని పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామస్తులు
శ్రీరామ జన్మభూమి అయోధ్య నుంచి లోకేశ్వరం మండల కేంద్రానికి అక్షంతలు చేరుకోవడంతో గ్రామస్తులు, హిందూ వాహిని కార్యకర్తలు సోమవారం శోభయాత్ర నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతం జై శ్రీరామ్‌ నినాదాలతో మార్మోగింది. కాషాయపు జెండాలను చేతబూని శ్రీరామ నినాదం చేయటంతో వీధులు కాషాయమయంగా మారాయి. ఈ శోభయాత్ర పలు వీధుల గుండా శోభయమానంగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, హిందు వాహిని కార్యకర్తలు, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *