నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం ఐదుగురు మృతి

సిరా న్యూస్,నల్గోండ;
నల్గోండ జిల్లా నిడమనూరు మండలం వెంపాడ్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి పది గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు..బైక్ నడుపుతున్న వ్యక్తి రమవత్ కేశవులు ను చూడటానికి వస్తున్న కుటుంబ సభ్యుల ఆటో ను ఢీకొట్టింది ట్యాంకర్.. ఆటోలో ఏడుగురు ప్రయనిస్తుండగా అందులో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.మృతులు రమావత్ కేశవులు, గణ్య, నాగరాజు, పాండ్య, బుజ్జి. మృతులు నిమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండా కు చెందినవారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *