సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం నగరంలోని వైరా రోడ్ ఆర్సీఎం చర్చ్ క్రిస్టమస్ వేడుకల్లో వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గోన్నారు. చర్చ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని, ఫాథర్ ఆశీర్వచనలుతీసుకున్నారు. యేసు క్రీస్తు చల్లని చూపు రాష్ట్ర, జిల్లా ప్రజల మీద ఉండాలని తుమ్మల కోరుకున్నారు. తుమ్మల వెంట కార్పొరేటర్ కమర్తపు మురళీ, కృష్ణ మోహన్ తదితరులున్నారు.