అక్రమ మట్టి తవ్వకాలపై అర్ధరాత్రి అధికారుల దాడి

కేసులు నమోదు.. పది టిప్పర్లు సీజ్

సిరా న్యూస్,ఏలూరు;
అర్ధరాత్రి అక్రమంగా మట్టి త్రవ్వకాలపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చొదిమెళ్ళ, దుగ్గిరాల లలో జిల్లా యంత్రాంగం దాడులు చేసింది. ఏలూరు ఆర్డీఓ ఎన్.ఎస్.కె,ఖజావలి,హోసింగ్ పిడి కె.రవికుమార్, మునిసిపల్ కమిషనర్ ఎస్.వెంకట కృష్ణ, ఏలూరు తహశీల్దార్ పోలీసులతో పాటు వెళ్లి తనిఖీలు చేసారు. అక్రమంగా రాత్రిళ్ళు మట్టి తరలిస్తున్న 10 టిప్పర్ల్లనులు సీజ్ చేసి, కేసు నమోదు చేసారు. టిప్పర్లనును పోలీస్ స్టేషన్ కు తరలించారుర. ఎఫ్ ఐ ఆర్ నమోదుచేసారు. అక్రమ త్రవ్వకాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. రాత్రిళ్ళు అక్రమంగా మట్టి త్రవ్వకాలపై యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసారు. ఇళ్ళ నిర్మాణం కోసం లబ్దిదారులు స్వయంగా మట్టిని తీసుకువెళ్లేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చాం. అది కూడా కేవలం పగటిపూట ఉదయం 6.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే అనుమతి వుంది. లబ్ధిదారుల ముసుగులో అక్రమంగా మట్టి తోలితే చర్యలు తప్పవని కలెక్టర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *