సిరా న్యూస్, ఆదిలాబాద్:
అటల్ బిహారీ వాజ్పాయ్ సేవలు చిరస్మరణీయం..
మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, అటల్ జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసిన గొప్ప దార్శనికుడు అటల్ బిహారీ వాజ్పాయ్ అని ఆయన అన్నారు. భారతదేశ ప్రధానిగా ఆయన దేశానికి చేసిన సేవలు సైతం శ్లాగనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బోయర్ విజయ్, జనగం సంతోష్, అంకత్ రమేష్, దినేష్ మటోలియా, తదితరులు పాల్గొన్నారు.