సిరా న్యూస్,నెల్లూరు;
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అనేక ప్రార్థన మందిరాల్లో అర్ధరాత్రి నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెల్లూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ పొంగూరు నారాయణ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏసుప్రభు ఆశీస్సులు అందరికీ ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.