సిరా న్యూస్, ఇచ్చోడ:
ఇచ్చోడలో దారుణ హత్య..
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈశ్వర్ అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు కొడవల్లు, కత్తులతో వెంబడించి అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన కలకలం రేపుతోంది.
హత్య చేసినంతరం స్థానిక పోలిస్ స్టేషన్లో నిందితులు లొంగిపోయారు. అయితే ఆస్తి తగాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు, ఈశ్వర్ ను వాళ్ళ దగ్గరి భందువులే హత్య చేసినట్లు తెలిసింది.