గ్రామ సెక్రెటరీల పాత్ర కీలకం
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని కలిసిన గ్రామ పంచాయతీ సెక్రటరీలు
సిరా న్యూస్,జగిత్యాల;
సంక్షేమ పథకాలు అమలులో రెవెన్యూ పంచాయతీ సెక్రెటరీ ల పాత్ర కీలకమని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ ఎమ్మెల్సీ నివాసం ఇందిరా భవన్ లో గ్రామ సెక్రెటరీ అధికారులు ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలలో రెవెన్యూ శాఖ పంచాయతీ శాఖ ప్రధాన పాత్ర వహిస్తుందని కరీంనగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు తప్పదన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు పాలన అధికారులు ఎవరైనా ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా వారి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఆలోచన విధానానికి అనుగుణంగా నిధులు నిర్వహించినప్పటికి, ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన విధానం నిరుపేదల సంక్షేమ మహిళలు ఆడబిడ్డల సంక్షేమం ప్రధానం అని తెలిపారు. నిరుపేద వర్గాలకు కల్పించే రాయితీల కల్పనకు మహిళలు, అడబిడ్డలు కల్పించే రాయితీలు సంక్షేమ పథకాలు 28 తేదీ నుండి రాబోయే జనవరి 6 వ తేదీ వరకు గ్రామ గ్రామన లబ్దిదారుల నుండి వారి విజ్ఞప్తి స్వీకరించడం జరుగుతుందన్నారు. వినతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నమూనాను ముద్రించడం జరిగిందన్నారు. ఆ నమునాలో ఎవరి అర్హత వారు కోరుకునే లబ్ది ఏంటి దాన్ని భర్తీ చేస్తూ గ్రామ పంచాయతీ గ్రామసభ కానీ వారికి ఎవరికి బాధ్యతలు అప్పగించడం జరిగిందో వారు విజ్ఞప్తులు స్వీకరించి తదుపరి పరిశీలించాలన్నారు. వారి అర్హతకు అనుగుణంగా ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు వారికి కల్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా ఎంచుకోవడం జరిగిందన్నారు. వాటితో పాటు ఈ 6 గ్యారెంటీ పధకాల దరఖాస్తు ముద్రించడం జరిగిందని, అయితే అందులో పేర్కోబడని అటువంటి అంశాలు ఉండి ఉన్న కానీ లబ్ధిదారులు ఎవరైతే వారు ఏదైనా వారి సమస్య కలిగి ఉండుంటే వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గత దశాబ్ద కాలం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి నూతన రేషన్ కార్డ్ జారీ ప్రక్రియ పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయిందన్నారు. ప్రభుత్వం అమలు చేతలపెట్టే అటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం అయిన ప్రధానం రేషన్ కార్డు అని చెప్పక తప్పదన్నారు. రేషన్ కార్డ్ కలిగి లేనటువంటి పేరు వ్యక్తిగతంగా వారి దరఖాస్తు అర్హత సూచిస్తూ రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగి ఉంటుందన్నారు. అలాగే వివాహానికి సంబంధించి కల్పించే ఆర్థిక సహాయం కూడా ఈ 6 గ్యారెంటీలలో పేర్కొనబడలేదని, ఈ 6 గ్యారెంటీ పధకాలు ప్రత్యేకంగా ఎన్నికల కంటే ముందు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా రూపొందించ పడ్డాయన్నారు. కళ్యాణలక్ష్మీ కల్పించే ఆర్థిక సహాయం గతంలో లక్ష పదహారు వేలు కల్పించబడ్డప్పటికీ ఈ లక్ష పదహారు వేల రూపాయలు కేవలం ఆడబిడ్డ తల్లిదండ్రులకు పెళ్లి సహాయార్థం ఖర్చులకే సరిపోతుందని, పెళ్లి కూతురుకి లక్ష రూపాయలకు అదనంగా తులం బంగారం వారికి ఆర్థికంగా సహాయం అందింపచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంకల్పించడం, ఈ పెళ్ళికి సమకూర్చే ఆర్థిక సహాయం కూడా దాన్ని విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. రేషన్ కార్డు, పెళ్లికి కల్పించే అటువంటి ఆర్థిక సహాయం అందులో పేర్కొన బడలేదన్నారు. 6 గ్యారెంటీ పధకాలు మాత్రమే కాకుండా ఈ 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తుకు నమూనా ముద్రించడం జరిగిందన్నారు. 6 గ్యారెంటీ పథకాలలో పేర్కొనని ఏది అయిన లబ్ది ఆశించినయితే విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్న గ్రామాలలో తెలియ చేయాలని అధికారులకు ఎమ్మెల్సీ తెలిపారు.