అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుమృతి

 సిరా న్యూస్,అంబెడ్కర్ కోనసీమ;
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ దగ్గరి బంధువులు అమెరికాలో రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. అమెరికాలోని టెక్సాస్ లో ట్రక్కు ఢీకొని ట్రక్ ఢీకొని ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బాబాయి, పిన్ని, వాళ్ళ కుమార్తె , మనవడు ,మనవరాలు మృతి చెందారు. బాబాయ పొన్నాడ నాగేశ్వరరావు(68) పిన్ని సీతా మహాలక్ష్మి (65), కుమార్తె నవీన (38), మనవడు కృతిక్ (11), మనవరాలు నిషిధ (9)లు. తల్లిదండ్రులురెండు నెలల క్రితం కూతురు ఇంటికి వెళ్ళిన ట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *