సిరా న్యూస్, ఆదిలాబాద్:
అన్నదాతలకు అన్ని కష్టాలే…
– తేమ పేరిట కొర్రీలు పెడుతున్న సీసీఐ
– గిట్టుబటు ధర లేక రైతుల విలవిల
– తీవ్రంగా వేధిస్తున్న కూలీల కొరత
పత్తి సాగుకు ఆదిలాబాద్ పెట్టింది పేరు. ఆసియాలోనే తిపెద్ద పత్తి మార్కేట్ కలిగిన ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఒకటి. అలాంటి ఆదిలాబాద్ లో ప్రస్తుతం పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. మార్కెట్ లో సీసీఐ తేమ పేరిట కొర్రీలు పెడుతుండటంతో, గిట్టుబాటు ధర లేక పత్తిని తక్కువ ధరకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు గ్రామాల్లో పత్తి ఏరేందుకు కూలీల కొరత వేధిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పత్తి ఏరకుండా చేల్లలోనే వదిలేయడంతో, పత్తి చేన్లు తెల్ల బంగారం తో తల తల మెరుస్తూ కనిపిస్తున్నాయి.