Kanagarthi Akshinthalu: కనగర్తి కి చేరిన అయోధ్య అక్షింతలు…

సిరా న్యూస్, కోనరావుపేట:

కనగర్తి కి చేరిన అయోధ్య అక్షింతలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి సోమవారం అయోధ్య రామాలయ అక్షింతలు చేరుకున్నాయి. సందర్భంగా గ్రామస్తులు డప్పు వాయిద్యాలు, భాజ భజంత్రీల నడుమ భజనలు చేస్తూ అక్షింతలతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్షింతలను భద్రపరిచారు. త్వరలోనే గ్రామంలోని ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ చేస్తామని గ్రామస్తులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *